ఉక్కు మహిళా ఇందిరాగాంధీ.

బెల్లంపల్లి,నవంబర్ 19, (జనంసాక్షి )
ఉక్కు మహిళా ఇందిరాగాంధీ అని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గోపాల్ అన్నారు. శనివారం
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలను కొనియాడారు. పరిపాలనపరంగా ఆమె తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాల గురించి వివరించారు. దేశ తొలి మహిళా ప్రధానిగా తాను తీసుకున్న డేరింగ్ నిర్ణయాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కఠిన పరిస్థితుల్లో సైతం ఆమె అవలంబించిన రాజనీతిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ కర్త, పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకులు కే సమ్మక్క, ఇతర అధ్యాపకులు గజెల్లి మోహన్, డాక్టర్ ఎన్ ఏకాంబరం, ఎంఏ రేష్మ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.