ఉద్యోగసంఘాల నేతలపై కేసులున్నట్లు నేను భావించడం లేదు : సబితా

నల్గొండ: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు ఉన్నట్లు తాను భావించడం లేదని, కేసులు ఉన్న విషయం తన దృష్టిలోకి రాలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా  ప్రజాప్రతినిధులు, విద్యార్థులపై పెట్టిన కేసులను పరిశీలిస్తున్నామని హోంమంత్రి అన్నారు. కరీంనగర్‌లో పెట్టిన వంద కేసులు పరిష్కారం దిశగా ఉన్నాయని, డిసెంబర్‌ 9 లోపు తెలంగాణపై అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.