ఉపాధ్యాయురాలిగా మారిన జెడ్పి చైర్మన్ సరితమ్మ…

-పరుమాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన…
-జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య…
 గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల జిల్లా పరుమాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య.. సందర్శించారు… అక్కడ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మమేకమై విద్యార్థులకు కొంత సమయం ఉపాధ్యాయురాలిగా   మరీ బోధించారు.. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు విద్య ఎలా‌ బోధిస్తారని,మధ్యాహ్న‌ భోజనం నాణ్యమైన భోజనం పెడుతున్నార లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు…రిటైర్డ్ ఎంఈఓ మేరమ్మ, ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు