ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

నల్గొండ, జనవరి 31 (): ఫిబ్రవరి 21న జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటరుగా నమోదైన ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ప్రత్యేక సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు జిల్లా కలెక్టర& రిటర్నింగ్‌ అధికారి యన్‌. ముక్తేశ్వర రావు తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నుండి ఆదేశాలు అందినట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఓటర్లు గమనించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.