ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్‌

నల్గొండ, జనవరి 31 (): నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు సంబంధించిన వికలాంగులైన ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రలో ప్రాధాన్యత నివ్వాలని జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ యన్‌.ముక్తేశ్వర రావు కోరారు. వికలాంగులకుప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేసి తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రాధాన్యత నివ్వాలని కలెక్టర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఆదేశాలు అందించనందున ఎన్నికల అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.