ఉమ్మడి జిల్లాకు నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం

టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి;
కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి
కోదాడ టౌన్ డిసెంబర్ 02 ( జనంసాక్షి )
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి తెరాస కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావులు అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిన్న జరిగిన సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులకు 1544 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్,  జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు.టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు
వెళ్లాలన్నారు.ఉమ్మడి జిల్లాకు నిధులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్,మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మా మధుసూదన్, గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీం,కౌన్సిలర్లు కోట మధు, కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్,కందుల చంద్రశేఖర్,గుండెల సూర్యనారాయణ,కమదాన చందర్ రావు,మైస రమేష్,మేదర లలిత,ఖదీర్ పాషా,కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ బ్రహ్మం,సాదిక్,నాయకులు బత్తుల ఉపేందర్,వంశీ నాని,సంగిశెట్టి గోపాల్,గంధం పాండు,లక్ష్మీనారాయణ,పిట్టల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.