ఎంపిపి దంపతులను సన్మానించిన ఒమాన్ ఫ్రెండ్స్ 

రుద్రంగి సెప్టెంబర్ 5 (జనం సాక్షి)
రుద్రంగి మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ తాను చేపట్టిన పదవి భాద్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను రుద్రంగి మండల ఎంపిపి గంగం స్వరూపరాణి మహేష్ దంపతులకు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సొషైటి అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు మరియు టీం సభ్యులు శాలువతో సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భముగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ.. సొషైటిలో చురుకుగా పని చేస్తున్న వారిని గుర్తించి మా సంస్థ ద్వారా సన్మానించి జ్ఞాపికలు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచికట్ల కుమార్,వంకాయల కార్తిక్,గడ్డం రవి, ఒలవేణి తిరుపతి,భాను తదితరులు పాల్గొన్నారు.