ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాలమూరు జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందేటప్పుడు అందరూ కలిసికట్టుగా రావాలని, రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస ప్రభుత్వం అబివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడడం లేదని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలందరూ రాజకీయాలకీతతంగా కలిసిరావాలని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ హయంలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.