ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట్…ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌,ఆగస్టు 20 : జిల్లాలోని కొడంగల్‌ మార్కెట్‌యార్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం మార్కెట్‌యార్డులోని ఓ గోదాము శంకుస్థాపనకు మంత్రి జూపల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం తన అనుచరులతో కలిసి రేవంత్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. కాగా రేవంత్‌తో పాటు వచ్చిన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇందుకు నిరసగా ధర్నాకు దిగిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.