ఎమ్మెల్యే శంకర్ నాయక్ హామీ ఇవ్వడంతో దీక్ష విరమించిన తండావాసులు…

కేసముద్రం అక్టోబర్ 12 జనం సాక్షి / కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామ శివారు చంద్రు తండా ను గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష బుధవారం 6వ రోజు కు చేరుకున్నాయి.ఇందులో భాగంగా దీక్షా శిబిరాన్ని ఎంపీపీ ఓలం చంద్రమోహన్,మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు,మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు,మహబూబాబాద్ జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు సందర్శించి ఈ సందర్భంగా వారు చంద్రు తండాను గ్రామ పంచాయతీ ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ హామీ ఇచ్చారని తెలపడంతో దీక్షను బుధవారం రోజున విరమించారు.