ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు

పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లి,రుద్రారం, నర్సాపూర్ గ్రామల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల స్కూలుకు కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు సౌకర్యంతో వెళ్లే స్థోమత లేక స్కూళ్లకు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఇట్టి విషయాన్ని మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి తాండూర్ డిపో మేనేజర్ తో మాట్లాడి నాగులపల్లి,రుద్రారం, నర్సాపూర్ గ్రామాల మీదుగా బస్సు ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడంతో బస్సు సర్వీసు ప్రారంభించారని ఆయా గ్రామాల విద్యార్థులు యువకులు తెలిపారు.ఈ విషయంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు.