ఎమ్మేల్యేకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అందరికీ వైద్యం అనే నినాదంతో ప్రతి గ్రామానికి పల్లె దావఖాన ఉండాలని సంకల్పించి మునగాల మండలంలోని ఐదు గ్రామాలకు పల్లె దవఖానాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు మునగాల మండల టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు చిర్రా శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పేదవాడు కార్మికులు నాణ్యమైన వైద్యం దొరకక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మునగాల మండల టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు.