ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం అందజేత

మంచాల మండలం దాత్ పల్లి గ్రామ పరిధిలోని దాత్ పల్లి  తండాలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ దోర్చి చందు నాయక్ ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో నిర్మించే నూతన ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా నిలుస్తాయని ప్రజలందరిలో భక్తి భావం పెరుగుతుందని చెప్పారు. ఎల్లమ్మ దేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాము నాయక్, ముకుంద నాయక్, హీరా లాల్, యూత్ ప్రసిడెంట్ జంగయ్య, రమేష్ నాయక్, వార్డు మెంబర్లు రాజు నాయక్, నాయకులు చంద్ర శేఖర్ గౌడ్, రాజు నాయక్, సచిన్, దేవేందర్, శ్రీదర్, దశరథ, తండా యువకులు తదితరులు పాల్గొన్నారు.