ఎసిటిసి బోర్డు బిల్డింగ్ కమిటి మెంబర్ గా బక్క ప్రవీణ్ కుమార్

జనగామ జూన్‌ 25 (జనం సాక్షి): ఆంద్ర దైవ జ్ఞాన కళాశాల(ఎసిటిసి) హైదరాబాద్ బోర్డు బిల్డింగ్ కమిటి మెంబర్ గా జనగామ జిల్లా కు చెందిన‌ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్, కరస్పాండెంట్
బక్క ప్రవీణ్ కుమార్‌ ను నియమించారు.
ఆంధ్ర ధైవజ్ఞాన కళాశాల జరిగిన 79వ బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఎసిటిసి మీటింగ్ లో బోర్డు బిల్డింగ్ కమిటీ  మెంబర్ గా ఎస్.టి.బి.సి నెల్లూరు తరుపున ప్రవీణ్ ను నియామకం చేశారు.
ఎస్.టి.బి.సి/పిఎబిసిల అధినేత  జిడిడి దివాకర్,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంచార్జి గుండెమడుగుల జడ్సన్ మాత్యుస్ కి   బక్క ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపారు.‌బక్క ప్రవీణ్ కుమార్ విద్యావ్యాప్తికి కృషి,బైబిల్ ఉచిత పంపిణి, శిలువ పరిచర్యతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్ సమయంలో కాపరులకు బియ్యం పంపిణి లాంటి పలు
సేవలకు గాను అరుదైన గౌరవం దక్కిందని జనగామలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.