ఎసిబి వలలో లైన్‌మెన్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌9

జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్ద షపూర్‌లో లైన్‌మెన్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో విూటర్‌ ఫిట్‌ చేయడానికి కాశీరాములు అనే లైన్‌మెన్‌ రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ రోజు రూ. 28 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిపోయాడు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.