ఎస్పీని కలిసిన పాస్ పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్

ఎస్పీని కలిసిన పాస్ పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పాస్ పోర్ట్ జారీకి సంబంధించి తెలంగాణ రీజినల్ పాస్ పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ సిబ్బంది మంగళవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను కలిసారు.పాస్ పోర్ట్ జారీలో జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పని తీరు, ఫారెన్ సర్వీసెస్ కు సంబంధించిన విషయాలపై వారు చర్చించారు.జిల్లాలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని, అర్జీదారులకు సత్వర సేవలు అందిస్తున్నామని, సాంకేతిక పద్దతిలో ముందుకు వెళ్తున్నట్లు  కౌన్సిల్ సిబ్బందికి ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.