ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రభుత్వం తక్షణమే ఎస్సీ మిగులు పోస్టులు (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ నేడు వాటి గురించి నోరుమెదపడం లేదని రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విమర్శించారు. మాలలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. సంఘటింగా పోరాటం సాగించి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.