ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తాజా సమాచారం. తన స్థాయి స్టార్‌ డమ్‌ ఉన్న సమకాలీన హీరోలకు దీటుగా చిరు కొత్త అడుగు వేయడానికి రెడీ అవుతున్నారట. అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీలో నటించడంపై ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌ లో ఈ సాంప్రదాయం ఇప్పటికే మొదలైంది. తెలుగులో ఇప్పుడిప్పుడే స్టార్ట్‌ అయింది. ఇటీవల జగపతి బాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌ లాంటి కేరక్టర్‌ నటులతో పాటు సత్యదేవ్‌ లాంటి యంగ్‌ హీరోలు సైతం.. వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఎంటర్‌ అవుతున్న తొలి సూపర్‌ స్టార్‌గా చిరంజీవి సరికొత్త రికార్డు నెలకొల్పాల నుకుంటున్నారట. ఈ క్రమంలో చిరు మంచి వెబ్‌ సిరీస్‌ కోసం చూస్తున్నారట. ఆల్రెడీ సినియర్‌ హీరో వెంకటేశ్‌.. రానా తో కలిసి ’రానానాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి చిరంజీవి స్థాయి స్టార్స్‌ అయిన రజనీకాంత్‌ మోహన్‌ లాల్‌ , మమ్ముట్టి సల్మాన్‌ ఖాన్‌ లాంటి సూపర్‌ స్టార్స్‌ ఇంకా ఓటీటీవైపు చూడలేదు. అయితే వీరందరి కంటే ముందే ఓటీటీలోకి ప్రవేశించి.. సరికొత్త రికార్డు సొంతం చేసుకోవాలని చిరంజీవి ఎª`లాన్‌గా తెలుస్తోంది. ఇండియా వైడ్‌ గా పాపులారిటీ సొంతం చేసుకున్న రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు ఇప్పటికే చిరును సంప్రదించారని, ఓ భారీ వెబ్‌ సిరీస్‌ కోసం చిరును ఒప్పించారని సమాచారం. అయితే వెబ్‌ సిరీస్‌ లో నటించడమంటే.. సినిమాల్లో నటించినంత తేలికకాదు. ఆయన్ని పక్కగా ఎస్టాబ్లిష్‌ చేయగలిగే అదిరిపోయే స్క్రిప్ట్స్‌ కావాలి. అలాంటి కథలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని చిరు చెప్పారని కూడా తెలుస్తోంది. మరి మెగాస్టార్‌ మొట్టమొదటి ఓటీటీ జెర్నీ.. ఎప్పుడు షురూ అవుతుందో చూడాలి.