ఔటర్‌పై ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

రంగారెడ్డి,మార్చి30(జ‌నంసాక్షి): రంగారెడ్డి  జిల్లాలోని శంషాబాద్‌ మండలం తొండుపల్లి సవిూపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. లారీ బోల్తాపడటంతో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.