కబ్జా చేసిన భూమికి దారి మూసేశారు.

సింగేణి జాగా వేసెయ్ పాగా కథనానికి అక్రమార్కులు అప్రమ్మత్తం అయ్యారు. ఇన్నాళ్లు మెయిన్ రోడ్డు నుంచి నిర్మాణ పనులు చేపట్టిన అక్రమార్కులు జనంసాక్షి కథనానికి భయపడ్డారు. అధికారులు గనక విచారణకు వస్తే అసలు బండారం బట్టబయలు అవుతుందని భావించి మెయిన్ రోడ్డు వచ్చే దారిని మూసేశారు. ఒకవేళ ఎవరైనా వస్తె అసలు అక్కడ ఏం నిర్మాణం జరగడం లేదనేలా జాగ్రత్త పడ్డారు. ప్రస్తతానికైతే దొడ్డిదారిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు కళ్ళు తెరచి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాపాడాలని స్థానికులు కోరుతన్నారు.