కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు:‌ ఎల్‌.రమణ, ఎర్రబెల్లి

aal3lhcvమహబూబ్‌నగర్, ఆగస్టు13:‌ ‌టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామని టీడీపీని విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఎల్‌.రమణ విమర్శించారు. టీడీపీ హయాంలో 4 ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు ఖర్చు చేశాం, 4 ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేసే అవకాశమున్నా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ ఎడారి కాబోతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని విమర్శించారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్‌ మూర్ఖత్వం వదిలి అందరినీ కలుపుకుపోవాలని ఆయన సూచించారు. కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.