కరెంట్‌షాక్‌తో రైతు మృతి

రంగారెడ్డి,ఆగస్టు 17: శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌లో కరెంట్‌షాక్‌తో రైతు రాజిరెడ్డి మృతిచెందారు. పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టు వేసిన విద్యుత్ కంచే వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టుం నిమిత్తం మృతదేహాన్ని స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.