కరెంట్ షాక్ తో రైతు మృతి

బిచ్కుంద జులై 08 (జనంసాక్షి)
కరెంట్ షాక్ కొట్టి రైతు దుర్మరణం చెందిన సంఘటన బిచ్కుంద మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్నగర్ గ్రామం పంచాయతీకి చెందిన పెద్ద హన్మప్ప కుమారుడైన గంగాధర్ రైతు 49, చేనిలో నీరు పారపెట్టడానికి వెళ్లి, బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ సప్లై వచ్చి రైతుకు కరెంట్ షాక్ కొట్టింది తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు బాన్సువాడా ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి ఒక కుమారుడు కలడు. చనిపోయిన రైతు భార్య ధరణి మయూరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు