కలుషిత అల్పాహారాన్ని తిని 35 మంది కార్మికులకు అస్వస్థత
జీడిమెట్ల: మెదక్ జిల్లాలోని బొంతపల్లిలో ఉన్న హెటిరో ట్రగ్స్ యూనిట&-4 పరిశ్రమలో కలుషితమైన అల్పాహారాన్ని తిన్న సుమారు 35 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉద్యోగులకు వాంతులు కావడంతో వారిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.