కల్వకుర్తిలో కార్డన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(): జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్‌ కాలనీలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీ నారాయణ, రవికుమార్‌తో పాటు 150 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్బంధ తనిఖీల్లో భాగంగా సరైనధృవపత్రాలు లేని 72 బైక్‌లు, 6 ఆటోలు, ఒక కారును పోలీసులు సీజ్‌ చేశారు.