కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

జుక్కల్, ఆగస్టు10,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతు మండలంలోని పోచారం తండాలో ఇద్దరికి ,బెంగపూర్,కాటేపల్లి,కాస్లబాద్ లో ఒక్కొక్కరికి ఈ చెక్కులు అందజేశామని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ,షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు కన్న పేదలకు వివాహా సమయంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.