కాంగ్రెస్సే లక్ష్యం.. ‘వెలి’వారం: టీజేఏసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని నిర్ణయిం చినట్లు టీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ ఉద్యమ కార్యాచరణను కో కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. ఐదు రోజుల పాటు ఎంపిక చేసిన 50 నియోజకవర్గాల పరిధిలో నిరసనలు తెలుపనుంది. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా వారి నియోజకవర్గాల్లోనే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో భారీ ఫ్లెక్సీల ఏర్పాటు, నల్ల జెండాలు ఎగురవేస్తామని, వారి ఇళ్లవద్ద సైతం నల్లజెండాలతో నిరసన తెలుపుత ామన్నారు. ఈనెల 21న మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు.