కాంగ్రెస్‌ ,కమ్యూనిస్టులకు కాలం చెల్లింది

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రత్యేక ఉద్యమం చేపడుతుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందించి ఆదుకుంటోందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందించటంతో పాటు గ్రావిూణ వ్యవస్థలో సమూలు మార్పులు తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రైతుల దుస్థితిని మార్చేందుకు ‘ప్రధాన మంత్రి కృషి సంచాయ్‌ యోజన పథకం’ అమలు చేస్తోందన్నారు.