కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి ):  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దు జెండాను ఆవిష్కరించి  ఘనంగా నిర్వహించారు. అలాగే తెలంగాణ ఇచ్చిన  జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు, భూక్య దళ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ తూ తెలంగాణలో 1200 మంది అమరుల త్యాగాలను ఒకసారి గుర్తు చేసారు.  మన భారత రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అన్నదాతల ఆత్మహత్యలు లేని బిడ్డలకు ఉద్యోగ, ఉపాధికి కొదువలేని
నిరుద్యోగుల ఆత్మబలిదానాలు లేని
సోనియమ్మ కలలుగన్న సామాజిక తెలంగాణ
ఏర్పాడాలన్నదే  కాంగ్రెస్ పార్టీ స్వప్నం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండా నరసింహారావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న ,భూక్యా దేవా నాయక్,ఇస్లావత్ రెడ్యా నాయక్, బానోత్ హరిలాల్,ఎనగంటి అర్జున్ రావు, రాసమల్ల నరసయ్య, చీమల లక్ష్మీనారాయణ, బానోత్ ఇస్తారి, బద్రు, బానోత్ భీమ, బోడ వీరన్ కుమార్, లావుడియా సురేష్, లావుడియా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.