కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులుండవ్

 వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాందాస్ నాయక్

జూలూరుపాడు, ఆగష్టు 3, జనంసాక్షి: కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని, ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే సహించేది లేదని వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్. హెచ్చరించారు. బుధవారం ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్రోహం చేశారని అన్నారు. బీజేపీ పార్టీలోకి చేరేందుకు సిద్దమైన రాజగోపాల్‌రెడ్డి అన్నం పెట్టిన అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ పెద్దలపై ఆరోపణలు చేయడం సహించరానిదని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నాడని విమర్శించారు. డబ్బు అహంకారంతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు దక్కించుకుని, స్వలాభం కోసం పార్టీ మారుతూ అబద్ధపు మాటలు మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు