కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి*

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ గంధం యాదగిరి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శకుంతల థియేటర్  వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్యలు హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపాటి శ్రీనివాసరావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, డిసిసి కార్యదర్శి కాంపాటి శ్రీను, గంధం యాదగిరి,  కర్రీ సుబ్బారావు, షాబుద్దీన్, బాగ్దాద్, భాజాన్, పాలూరి సత్యనారాయణ, సైదిబాబు, ధావల్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.