కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన మైనారిటీ యువ నాయకులు 40 మంది మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్బంగా ప్రసాద్ కుమార్  మాట్లాడుతూ యువత భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ముఖ్యంగా మైనారిటీ లకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో సంక్షేమ పథకాలు,4% రిజర్వేషన్  కల్పించిందని  గుర్తు చేశారు పార్టీలో చేరిన సలీం, ముజీబ్, షకీల్, జాహిద్,వారి అనుచరులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసము ప్రసాద్ కుమార్  గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోచారం వెంకటేశంతో పాటు తురుమామిడి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది,