కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి

7rwtlp7oజడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్‌, శ్రీశైలం, కుమార్‌, మహేశ్‌ ఓ స్థల వివాదం విషయంలో ఆదివారం జడ్చర్లలోని తెరాస నాయకుడి ఇంటి వద్ద పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి వెంకటయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. జడ్చర్ల పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.