కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మానవపాడు మండలం పల్లెపాడులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు.తండ్రి ఇసాక్ తన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ(4), 10 నెలల బాలుడు కు ఉరివేశాడు.దీంతో పిల్లలిద్దరూ మృతిచెందారు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.