కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తుల ను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. గ్రామాల్లోని మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన చెరువుల్లో నూరు శాతం ఉచితంగా చేప పిల్లలను అందించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల, కులాల ఆర్థిభివృద్ధి కొరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ప్రభుత్వం గూడు లేని ప్రతి పేదవానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పేదవారి కలలను సాకారం చేస్తుందన్నారు.