కూర్చుని మాట్లాడుకుందాం
` వివాదాలు వద్దు
` చంద్రబాబు వినతి
అమరావతి(జనంసాక్షి): సముద్రంలో కలిసే వృధా నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. బనకచర్లపై తెలంగాణ వివాదం చేయడం సరికాదని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నీళ్లను ఇరు రాష్టాల్రు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు.‘మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయి. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అన్నారు. వృధా నీటి విషయంలో గొడవ పడడం ద్వారా ప్రయోజనాలు ఉండవన్నారు.