కెజిబివి విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

కెజిబివి పాఠశాల ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే రేఖ ఆగ్రహం
ఖానాపూర్ రూరల్ 19 ఆగష్టు జనం సాక్షి: ఖానాపూర్ మండలం లోని కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే రేఖ నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖ నాయక్ విద్యార్ధులతో మాట్లాడారు.అలాగే వారి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో మెను బోర్డ్ ను పాఠశాల లో ప్రదర్శించక పోవడంతో ఎమ్మెల్యే రేఖ నాయక్ ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు ఎ సమస్యలు ఉన్నా నాకు తెలియజేయాలని విద్యార్థులకు తెలిపారు.అలాగే సుర్జాపూర్ గ్రామ పంచాయతీ లో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు తాలపెళ్లి రాజ గంగన్న,మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్,వైస్ చైర్మన్ గొర్రె గంగధర్,ఎంపిపి మోహిద్,డి ఆర్ బి ఎస్ డైరెక్టర్ కొక్కుల ప్రదీప్,సినిర్ నాయకులు శోభన్, తెరాస నాయకులు పాల్గొన్నారు.