కెసిఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ..

చండ్రుగొండ జనం సాక్షి (ఫిబ్రవరి 15) :మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్ ప్యాకెట్లతో పాటు , పండ్లను అందించారు.అనంతరం పార్టీ నాయకత్వం , మండల ప్రజల తరపున కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దార బాబు, తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు మండల నాయకులు వైద్య అధికారి రాకేశ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.