కేంద్రంలో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి

కొత్తకోట గ్రామీణం: కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రామచంద్రన్‌ పిళ్ల్తె అన్నారు. సీపీఎం సందేశ్‌ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటకు చేరుకున్నారు. యూపీఏ సర్కార్‌లో జరిగిన అవినీతి సొమ్ముతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ఉచితంగా ప్రవేశపెట్టవచ్చిన అన్నారు. అన్నింటి ధరలు పెంచుతూ సర్కారు పేదల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.