కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 3 : తెలంగాణ రాష్ట్రంలో కరవు దారుణంగా ఉందని, వ్యవసాయబావులు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బచావో మిషన్‌ ఆధ్వర్యంలో బాలానగర్‌ మండలం రంగారెడ్డిలో ఎండిన పంటలను నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి, యెన్నం లక్ష్మీనారాయణలు పరిశీలించారు. కరవు దారుణంగా ఉన్నా కేబినెట్‌లో దీనిపై చర్చ జరగలేదన్నారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని నాగం ఆరోపించారు