కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం : ఎల్‌.రమణ

మహబూబ్‌నగర్‌, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మండలి ఎన్నికలతో కేసీఆర్‌కు కనువిప్పు కలగాలన్నారు. సీఎం పాలనలో 900మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పేదలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ త్వరలోనే ఉద్యోగులను కూడా మోసం చేయడం తథ్యమని రమణ అన్నారు.