కొత్త బైక్ సరదాతో ఓ యువకుడు మృతి..

రంగారెడ్డి : కొత్త బైక్ పై ఓ సారి ట్రయల్ వేద్దామన్న సరదా యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఓ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న సయ్యద్ హఫీజ్ (23) డివైడర్‌కు బలంగా ఢీకొని గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు. సయ్యద్ హఫీజ్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.