కొత్త సినిమా కోసం నయనతార మేకప్‌

హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తోన్నా.. ఇప్పటికీ యంగ్‌ హీరోయిన్స్‌కి పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది నయనతార. ఇటీవల దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లాడడంతో ఆమె లైఫ్‌లో ఈ ఇయర్‌ స్పెషల్‌గా మారింది. పర్సనల్‌ లైఫ్‌లోనే కాదు… ఆమె కెరీర్‌లోనూ ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. తన డెబ్భై అయిదో సినిమాని చేయబోతోంది నయన్‌. ఇటీవలే ఈ మూవీకి సైన్‌ చేసింది. అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. శంకర్‌ అసిస్టెంట్‌ నీలేష్‌ కృష్ణ దీనికి దర్శకుడు. నాడ్‌ స్టూడియోస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌ని సోషల్‌ విూడియా ద్వారా రివీల్‌ చేసిన టీమ్‌, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారతో సినిమా చేయనుండటం హ్యాపీగా ఉందని చెప్పింది. ’రాజా రాణి’ చిత్రంలో నయనతారకు జంటగా నటించిన జై, తండ్రిగా నటించిన సత్యరాజ్‌ ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి థాయ్‌లాండ్‌ వెళ్లొచ్చిన నయన్‌, ప్రస్తుతం ముంబైలో షారుఖ్‌తో కలిసి ’జవాన్‌’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది. అతి త్వరలో కొత్త చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ కానుంది. పెళ్లి తర్వాత ఆమె సైన్‌ చేసిన ఫస్ట్‌ మూవీ ఇదే. ఇక నయనతార నటించిన మలయాళ చిత్రం ’గోల్డ్‌’ ఆగస్టు 19న విడుదల కానుంది. చిరంజీవి ’గాడ్‌ ఫాదర్‌’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది