కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు..

నల్గొండ : నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, గనులు, ఐటీ రంగంపై డాక్టర్ సురేందర్‌రెడ్డి, ఆస్కి మాజీ డైరెక్టర్ విశ్లేషణ చేయనున్నారు. శాంతిభద్రతలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి.. పార్లమెంటరీ ప్రక్రియ, శాసనసభ విధానాలు అంశంపై అసెంబ్లీ కార్యదర్శి ఎస్ రాజా సదారాం..వ్యవసాయం అంశంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక అధికారి ఎకానమీ డాక్టర్ ప్రవీణ్‌రావు, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు అంశంపై ప్రభుత్వ సలహాదారు జీడీ రెడ్డి క్లాసులు చెప్పనున్నారు.