కోడేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్దం.

కోడేరు మండల కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తంన్న ప్రజా వ్యతిరేక విధానాలపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ ని రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందుకు నిరసనగా ఏఐసిసి మరియు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీసు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దె శాంతయ్య తెలిపారు.కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక లో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,లపై అక్రమ కేసుల్లో బాగంగా ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో ద్వారా వారు, మానాయకులు మూడు రోజుల నుండి విచారణ పేరుతో వేధిస్తున్నారని మరియు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని మిద్దె శాంతయ్య మండిపడ్డారు.
ఇది కక్ష సాధింపు చర్యలు తప్పా మరోకటి కాదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.