కోదాడ బస్ స్టాండ్ ఆవరణ సుందరీకరణకు కృషి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ జూన్ 15 ( జనంసాక్షి )
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతిలో బాగంగా
 కోదాడ పురపాలక సంఘం పరిధిలో పద మూడవ రోజు 30, 12,26 వ వార్డ్ ల్లో జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం 26 వ వార్డ్ పరిధిలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న క్లీనింగ్ పనులపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ,ఆ ప్రాంగణం అంతా ప్రకృతి వనం లా సుందరీకరించాలని,వచ్చే హరితహారంలో భాగంగా ఆ ప్రాంతం అంతా పూలు మరియు పండ్ల మొక్కలతో నింపాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమీషనర్ మహేశ్వర రెడ్డి ,వార్డ్ కౌన్సిలర్ ఫాతిమా ఖాజా,షేక్.షఫీ,సుశీల రాజు,బస్ డిపో మేనేజర్ హర్ష గారు,ఏఈ వరుణ్,
సానిటోరీ ఇన్స్పెక్టర్ యాదగిరి,యాదా సుధాకర్,
చలిగంటి వెంకట్,బషీర్,మునిసిపల్ సిబ్బంది,బస్ డిపో సిబ్బంది మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.