కోల్‌ఫీల్డ్‌ నేపథ్యంలో అక్షయ్‌ సినిమా

బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ మరోసారి సింగ్‌గా అభిమానులను అలరించబోతున్నాడు. 2008లో సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అంటూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అక్షయ్‌..మరోసారి సింగ్‌ పాత్రలో ఫ్యాన్స్‌ ను ఖుషీ చేయబోతున్నాడు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ
మూవీలోనూ అక్షయ్‌ పంజాబీ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అక్షయ్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ లీకైంది. ఎరుపు కలర్‌ తలపాగాతో పాటు బ్లూ కలర్‌ షర్ట్‌ ధరించిన అక్షయ్‌ కుమార్‌..భయంకరంగా చూస్తున్నాడు. అక్షయ్‌ తన పాత్ర కోసం గడ్డం పెంచాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌ లుక్‌ అభిమానులు ఆకట్టుకుంటోంది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ చిత్రం టైటిల్‌?ను ఇంకా ప్రకటించలేదు. అయితే 1989లో రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్‌లోని గనిలో చిక్కుకున్న 64 మంది మైనర్లను రక్షించిన మైనింగ్‌ ఇంజనీర్‌ జస్వంత్‌ సింగ్‌ గిల్‌ కథే.. సినిమాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ లండన్‌ లో జరుగుతోంది. యార్క్గ్‌ªర్‌ ఫీల్డ్‌లో చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా.. ఓ అభిమాని ఫోటో తీసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేయడంతో..వైరల్‌ అయింది. 100 ఎకరాలకు పైగా భూమిలో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్ట్‌ చివరి నాటికి ఈ సినిమాను పూర్తి చేసి..దసరా నాటిని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చిత్రం గత నెలలో విడుదలైంది. చందప్రకాశ్‌ ద్విదేవి దర్వకత్వం వహించిన ఈ మూవీలో మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ నటించింది. యష్‌ రాజ్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాలని అక్షయ్‌ నిర్ణయించుకున్నాడు.