క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): క్రిస్మస్ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.పండుగ రోజున బహుమతుల ప్రధానం, ప్రేమ విందు కార్యక్రమం కొరకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు , ఆర్డీఓ రాజేంద్రకుమార్ , డిడబ్ల్యూఒ శంకర్ , కమిటీ సభ్యులు పాల్గొన్నారు.