క్షేత్రస్థాయి పరిశీలనతో కాళేశ్వరంపై సవిూక్ష

వరుసగా రెండోరోజు ప్రాజెక్టుల సందర్శన

వర్షాలు ఊపందుకోవడంతో జాగ్రత్తలపై చర్చించిన మంత్రి హరీష్‌

పెద్దపల్లి,జూన్‌12(జ‌నం సాక్షి): రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. మంగళవారం ఉదయం అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులపై ఇంజనీర్లు, గుత్తెదారులతో మంత్రి సవిూక్ష సమావేశం నిర్వహించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనుల ప్రణాళికపై సవిూక్ష జరిపారు. రోజు వారీ పని ప్రణాళికలు తయారు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో నిర్మిస్తున్న సుందిళ్ళ బ్యారేజీ క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్‌ రావు సోమవారం అర్థరాత్రి బస చేసిన విషయం తెలిసిందే. వర్షాకాలం సవిూపించడంతో వానలు పడడంతో గోదావరి పరవళ్లుత ఒక్కుతున్న వేల పనుల్లో వేగం తగ్గిందని మంత్రి అన్నారు. వర్షౄల కారణంగా ఆయా ప్రాజెక్టులకు సంబందించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. దీనిని అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉందని అధికారులతో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీష్‌ రావు మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా , బురదలో ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. ముందుగా కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నిర్మాణ పనుల సవిూక్ష నిర్వహించారు. నాలుగు పంప్‌ హౌస్‌ల నిర్మాణాన్ని జులై 15 కల్లా పూర్తి చేయాలని ఇంజనీర్లను, గుత్తేదారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన మైలు రాయని , ఇది పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. గ్రావిటీ కెనాల్‌ లో 29 నిర్మాణాల్లో, 24 నిర్మాణాలు ప్రాముఖ్యమైనవి చెప్పారు. ఇందులో 23 దాదాపు పూర్తి కావొస్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. మిగతా నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత పెద్దవాగు నీటిని దిగువకు మళ్లించే అండర్‌ టన్నెల్‌ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ నిర్మాణంలో అవసరమైన బూమర్లు ఐదుకు పెంచాలని, సెంట్రింగ్‌ కార్మికులను మరో 200 మందిని పెంచాలన్నారు. కార్మికుల కొరత ఉందని ఇంజనీర్లు, గుత్తేదారులు తెలపడంతో మంత్రి హరీష్‌ రావు రాష్ట్రంలోని నాలుగు ఏజెన్సీ లతో మాట్లాడి మరో 200 మంది కార్మికులను పంపాలని ఫోన్లో కోరారు. అందుకు నాలుగు ఏజెన్సీల గుత్తేదారులు అంగీకరించారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, మూడు షిఫ్టుల్లో పని చేయించాలని సైట్‌ ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే ప్రతీ రోజు మూడు షిఫ్టుల్లో పని చేసే దృశ్యాలను , చిత్రాలనువాట్సప్‌ ద్వారా పంపాలని ఆదేశించారు. అనంతరం అన్నారం బ్యారేజీ పనులను హరీశ్‌ రావు పరిశీలించారు. బ్యారేజీ పై నిర్మిస్తున్న రహదారి గడ్డర్ల పురోగతిని పరిశీలించారు. 495 గడ్డర్లకు గాను 165 గడ్డర్లను ఏర్పాటు చేసినట్లు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. మరి కొన్ని క్రేన్లు వినియోగించి వర్షాలు పెరిగేలోగా పనులు పూర్తిచేయలన్నారు. పనుల నాణ్యతతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా సమాంతరంగా పనులు చేయాలని సూచించారు. అన్నారం బ్యారేజీ పనులను సందర్శించిన అనంతరం ప్రాజెక్ట్‌ గెస్ట్‌ హౌస్‌ లో రాత్రి 9 గంటల కు సవిూక్ష నిర్వహించారు. బ్యారేజీ గేట్ల బిగింపునకు సంబంధించిన పనులపై మంత్రి హరీష్‌ రావు సవిూక్షించారు. 22 గేట్లకు గాను 15 గేట్లు బిగించామని ఇంజనీర్లు తెలిపారు. మిగతా పనులను జులై 20 నాటికల్లా పూర్తి చేసి వెంటనే ట్రయల్‌ రన్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను, రోజు వారీ పని వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని మంత్రి ఆదేశించారు. బ్యారేజికి సంబంధించి కరకట్టల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇరు వైపులా నిర్మిస్తోన్న కరకట్టలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వైపులా కరకట్టల పటిష్టత కోసం రివిట్‌ మెంట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.ఇక పని చేసే వారిని గుర్తించి అవార్డులను అందజేస్తామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అవాంతరాలు వచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. మరో పదిరోజుల్లో మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తానని మంత్రి చెప్పారు.