ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

హైదరాబాద్‌: ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృతి చెందారు.